తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్రగతి భవన్ నుంచి గన్పార్క్ చేరుకున్న ఆయన అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.
అనంతరం కేసీఆర్ రెండు నిమిషాలపాటు ఆయన మౌనం పాటించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా అమరవీరులకు నివాళులు అర్పించారు.
అనంతరం ప్రగతిభవన్లో కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మరోవైపు తెలంగాణ భవన్లోలో నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు అక్కడ జాతీయ జెండా ఎగురవేశారు. సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద మంత్రి కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.