దుబాయ్లో ఈ నెల 6 నుంచి 13 వరకు జరగనున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఆయన వెంట సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఐఏఎస్ అధికారులు అర్వింద్ కుమార్, జయేష్ రంజన్ తదితరులు వెళ్లనున్నారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలు కొందరు సీఎం వెంట వెళ్లే అవకాశం ఉంది.
రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పర్యటించనున్న కేసీఆర్ పలు కంపెనీల ప్రతినిధులతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పూర్తిస్థాయి మంత్రివర్గం లేకపోవడం, వారం రోజుల పాటు పర్యటన ఉండడం వల్ల సీఎం వెళ్తారా? లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. సీఎం పర్యటనపై అధికారికంగా శుక్రవారం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశముంది.