telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అరుణ్ జైట్లీ సేవలు మరువలేనివి: సీఎం కేసీఆర్

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఈరోజు మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ ఈరోజుఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జైట్లీ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పార్లమెంటేరియన్ గా, ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ అందించిన సేవలు మరువలేనివని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జైట్లీ మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని తెలిపారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.గతేడాది అరుణ్ జైట్లీ కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. అయితే కొంత కాలానికే జైట్లీకి అరుదైన కేన్సర్ వ్యాధి ఉన్నట్లు బయటపడింది. దీంతో ఆయన అమెరికాలో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు.

Related posts