telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం: సీఎం జగన్

cm jagan ycp

విధినిర్వహణలో భాగంగా పెన్షన్లు పంపిణీ చేస్తూ గ్రామ సచివాలయం వాలంటీర్ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మరణించారు. విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో ఆమె పెన్షన్లు పంపిణీ చేస్తూ ఆమె ప్రాణాలు విడిచారు. దీనికి సంబంధించిన వార్తను దినపత్రికలో చూసిన ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించారు. సీఎంవో అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మృతి చెందిన అనురాధ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ… విపత్తు సమయంలో కూడా కష్టపడుతున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనురాధ కుటుంబానికి వెంటనే పరిహారం అందేలా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

Related posts