telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పేదోడి నోటి దగ్గర కూడు లాక్కున్నది జగన్: బుద్ధా వెంకన్న

ycp jagan with malya meeting said budda

ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అన్న క్యాంటీన్లను ఎత్తేసి పేదోడి నోటి దగ్గర కూడు లాక్కున్నది జగన్ అని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిందని, ఒక్క సెంటు భూమి ట్రేడింగ్ అయినట్టు ఆధారాలు చూపించలేక పోయారని విమర్శించారు.పెన్షన్ పెంచుతామని చెప్పి వృద్ధులను మోసం చేశారన్నారు.

45 ఏళ్లకే బీసీ,ఎస్టీ,ఎస్సి మహిళలకు పెన్షన్ అని చెప్పి దగా చేసింది, రైతులను వంచించింది, నిరుద్యోగులను హేళన చేశారన్నారు. ఇంకా ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ అంటూ పాట పాడితే ‘మీ ముఖ్యమంత్రి గారు చేతగాని వాడనే అనుమానం మీ పార్టీలో మరింత బలపడుతుంది సాయి విజయసాయిరెడ్డి గారు అంటూ బుద్ధా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Related posts