telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సచివాలయంలో జగన్ .. మూడు ఫైళ్లపై సంతకాలు

jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఈ ఉదయం సచివాలయంలో వైఎస్ జగన్‌ అడుగుపెట్టారు. ఉదయం 8:39 గంటలకు సచివాలయంలో అడుగుపెట్టిన జగన్‌కు సచివాలయ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం మూడు కీలక ఫైళ్లపై సంతకం చేశారు. ఆశావర్కర్ల వేతనాలను రూ. 10వేలకు పెంచుతూ తొలి సంతకం చేయగా, అనంతరం ఎక్స్‌ప్రెస్‌ హైవేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్ట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ ఫైల్‌పై ముఖ్యమంత్రి మూడో సంతకం చేశారు.

Related posts