telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రాలు: సీఎం జగన్

ys jagan cm

ప్రతీ గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ నాటికి మొత్తంగా 11,158 కేంద్రాలు పనిచేస్తాయన్నారు. రైతుల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించడానికి ఈ కేంద్రాలు తోడ్పడుతున్నాయని తెలిపారు. ఈ కేంద్రాలు రైతులనుంచి పంట ఉత్పత్తులు కూడా కొనుగోలు చేస్తాయన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై ఈ కేంద్రాల్లో రైతులకు అవగాహన కల్సిస్తారన్నారు. ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణను అందిస్తారని చెప్పారు. రైతులకు కావలసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఈ కేంద్రాల్లో విక్రయిస్తారని చెప్పారు. భూసార పరీక్షలు కూడా ఇక్కడనుంచే జరుపుతారన్నారు. రైతులకు లాభం కలిగే పంటలు వేయడానికి మార్గ నిర్దేశనం కూడా ఈ కేంద్రాలు చేస్తాయన్నారు. వ్యవసాయ అనుబంధ వృత్తుల వారికి కూడా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. పశువులకు కూడా హెల్త్ కార్డులు ఇస్తున్నామని సీఎం తెలిపారు.

Related posts