విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం చెరువూరులో ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై ఏపీ సీఎం జగన్ స్పందించారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందజేయాలని సూచించారు. కోరుకొండ సంతకు వెళ్లిన 11 మంది ఆటోలో తిరిగి వస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.