telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అయ్యా పవన్ కల్యాణ్ గారూ… మీ పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారు?

ys jagan cm

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ 132వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రతిభావంతులకు జగన్ పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం విషయాన్ని ప్రస్తావిస్తూ పవన్ పై విమర్శలు గుప్పించారు. “అయ్యా పవన్ కల్యాణ్ గారూ… మీకు ముగ్గురు భార్యలు. బహుశా నలుగురో, ఐదుమందో పిల్లలు. వాళ్లందరినీ ఏ మీడియంలో చదివిస్తున్నారో అడుగుతున్నాని సూటిగా ప్రశ్నించారు.

ఇవాళ, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే, నష్టపోయేది మనం. మన రాష్ట్రం నష్టపోతుంది. జాతి నష్టపోతుంది. మనం పిల్లలకు ఆస్తులు ఇవ్వాలంటే, అతిగొప్ప ఆస్తి చదువు. ఆ చదువు ప్రతి పేదవాడికీ చెందాలి. ఏ పిల్లాడూ, తల్లీ అందుకోసం అప్పులపాలు కాకుండా చూడాలన్నదే నా ఉద్దేశం” అని అన్నారు. డిసెంబర్ లో మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని, నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని 40 వేల స్కూళ్లలో 15 వేల స్కూళ్లను మార్చనున్నామని తెలిపారు.

Related posts