తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు శిలాఫలకంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును లిఖించారు. తొలి నుంచి పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలోనూ అదే విధానాన్ని పాటించారు.
శిలాఫలకంపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల పేర్లను లిఖించి వారికి సముచిత గౌరవాన్ని కల్పించారు. శిలాఫలకంపై మొదటగా గవర్నర్ నరసింహన్ పేరు ఉండగా, ఆ తర్వాత ప్రాజెక్టు ప్రారంభకర్తగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్లను శిలాఫలకంపై చెక్కించారు.