ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మంత్రి వర్గ ఉప సంఘం ఈ రోజు ఉదయం భేటీ అయింది. ఈ భేటీలో రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించింది. మాజీ సీఎం చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై మంత్రి వర్గ ఉప సంఘం ఏపీ ముఖ్యమంత్ర జగన్ కు నివేదిక ఇచ్చింది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిపై ఏసీబీతో పాటు నిపుణుల సహకారంతో మంత్రివర్గ ఉప సంఘం నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది.
టీడీపీ పాలనలో రాష్ట్రంలో చోటు చేసుకున్న సాగునీటి ప్రాజెక్టుల, రాజధాని పనుల్లో జరిగిన అవినీతితో పాటు పలు అంశాలపై నివేదిక ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ వైసీపీ నేతలు మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు సీఎం జగన్ కు నివేదిక అందజేశారు.