ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. ఈ భేటీలో గంటకు పైగా విభిన్న అంశాలపై గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య చర్చలు జరిగాయి. చాలా రోజుల తర్వాత గవర్నర్తో సీఎం భేటీ జరుగుతోంది. ప్రధానంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, విద్యుత్ కొరత తదితర అంశాలపై చర్చించాలని జగన్ నిర్ణయించారు. తాజా రాజకీయ పరిస్థితులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గవర్నర్కు వివరించారు. అలాగే త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గవర్నర్కు తెలిపారు.
జగన్ తానేదో పెద్ద స్పెషలిస్ట్ అనుకుంటున్నాడు: తులసిరెడ్డి