ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన లోటస్పాండ్లోని తన నివాసానికి వెళ్లారు. తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విభజన వివాదాల పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వేదికగా ఈ నెల 28, 29 తేదీల్లో మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపనున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమస్యలకు సత్వర ముగింపు పలికేందుకు ముఖ్యమంత్రులిద్దరూ ఇప్పటికే మూడు పర్యాయాలు సమావేశమై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే మరో సారి చర్చలు జరిపేందుకు జగన్ హైదరాబాద్ చేరుకున్నారు.