telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ.. ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రైతులకు సున్నా వడ్డీ రుణాలపై వాడివేడి చర్చ కొనసాగుతుంది. ఈ విషయం పై సీఎం జగన్ మాట్లాడుతుంటే పదేపదే టీడీపీ సభ్యులు అడ్డు తగిలారు. ఈ క్రమంలో తెలుగుదేశం సభ్యులపై జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “అధ్యక్షా… వాళ్లు 20 మంది ఉన్నారు. మా వాళ్లు 150 మంది ఉన్నారు అధ్యక్షా… మా వాళ్లు ఒక్కసారి లేచారంటే, వాళ్లు తమ స్థానాల్లో కూడా కూర్చోలేరని చెబుతున్నాను.

ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు…కనీసం మర్యాద లేదు, గౌరవం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా నేను సమాధానం చెబుతూ ఉన్నాను. మీ చంద్రబాబునాయుడు మాట్లాడేటప్పుడు మేం మాట్లాడామా? ఒక్కరికైనా బుద్ధుందా? ఏ రకంగా ఎమ్మెల్యేలు అయ్యారయ్యా? బుద్ధీ, జ్ఞానం లేకుండా ఉన్నారని టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts