telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆ జీవోను చంద్రబాబు పూర్తిగా చదివారా..?: జగన్ తీవ్రవ్యాఖ్యలు

jagan on ap assembly sessions

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. 2430 జీవో రద్దు అంశంపై అసెంబ్లీ అట్టుడుకుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతోంది. ప్రతిపక్ష సభ్యుల విమర్శలపై సీఎం జగన్ మాట్లాడుతూ.. జీవో రద్దుపై ప్రతిపక్ష నేత తీరు ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.

ఆ జీవోను చంద్రబాబు పూర్తిగా చదివారా..? లేదా ఇంగ్లీష్‌ను అర్థం చేసుకోవడంలో లోపం ఉందా? అనిప్రశ్నించారు. ఈ సందర్భంగా జీవోను సీఎం జగన్ చదివి వినిపించారు. నిరాధార వార్తలు రాసిన వారిపై ఫిర్యాదు చేసే అధికారం.. సంబంధిత శాఖలకు జీవో ద్వారా ఇచ్చామన్నారు. జీవోను తప్పుబట్టేందుకు అవకాశమే లేదన్నారు. ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఇంగితజ్ఞానం లేదని జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Related posts