telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరైన జగన్

jagan attending guntur iftar tomorrow

అక్రమాస్తుల కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్ హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి నేరుగా కోర్టుకు చేరుకున్నారు. అంతకుముందే కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తదితరులు సీబీఐ కోర్టుకు చేరుకున్నారు.

పాలనా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందువల్ల కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాలేనని కోర్టును జగన్ కోరిన నేపథ్యంలో, గత కొన్ని నెలలుగా ఆయనకు కోర్టు మినహాయింపును ఇచ్చింది. అయితే, ఈరోజు తప్పనిసరిగా విచారణకు హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించడంతోఈరోజు జగన్ కోర్టుకు హాజరయ్యారు.

Related posts