ఉగ్రవాదులకు ,జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో గత రాత్రి ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించే సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. ఈ కాల్పుల్లో తెలంగాణకు చెందిన జవాన్ ఒకరు, అలానే ఆంద్ర ప్రదేశ్ కు చెందిన జవాన్ ఒకరు వీర మరణం పొందారు. తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లా కోమన్ పల్లికి చెందిన ర్యాడ మహేష్ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో సైనికుడిని ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రవీణ్కుమార్ రెడ్డి (37) గా గుర్తించారు. అయితే…వీర జవాన్ ప్రవీణ్కుమార్ రెడ్డికి సీఎం జగన్ సంతాపం తెలిపారు. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం జగన్ రూ. 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా ఆ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. వారి కుటుంబానికి ప్రభుత్వం ఎళ్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
previous post