మహారాష్ట్రలో ఈ రోజు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సుపరిపాలన కోసమే బీజేపీకి అత్యధిక సీట్లను ప్రజలు కట్టబెట్టారని ఆమె పేర్కొన్నారు. శివసేన బీజేపీని మోసం చేసిందన్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమై విపక్షాలతో జతకట్టిందన్నారు. ప్రజల నమ్మకాన్ని ఫడ్నవీస్ నిలబెడతారని ఆమె ఆకాంక్షించారు.
మహారాష్ట్రలోన్ రాజకీయ అనిచ్ఛితికి ఎట్టకేలకు ఈ రోజు తెరపడింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ తో గవర్నర్ భగత్ సింగ్ కోష్యార్ ప్రమాణస్వీకారం చేయించిన సంగతి తెలిసిందే.