రాష్ట్ర భవిష్యత్ని మోదీ అంధకారం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. శుక్రవారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ లోక్సభలో మోదీ ప్రసంగం పుండు మీద కారం చల్లినట్లుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో మోదీ చాలా దారుణంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఏపీకి జరిగిన విభజన గాయాన్ని మోదీ పెద్దది చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. లోక్సభలో గల్లా జయదేవ్ ప్రసంగానికి చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. టీడీపీ ఎంపీల స్పూర్తి అందరిలో రావాలని నేతలకు సూచించారు. తెలంగాణలో ఏమీ చేయని కేసీఆర్కు 80 సీట్లు వస్తే తమకెన్ని ఎన్ని సీట్లు రావాలన్నారు. కాపులకు రిజర్వేషన్ ఇస్తామన్న మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. జగన్, కేసీఆర్, మోదీ కుమ్మక్కయ్యారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.