telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్ర బాగుపడితే తన అసమర్థత తెలిసిపోతుందని కేసీఆర్‌ భయం!

Chandrababu comments Jagan cases

ఆంధ్ర బాగుపడితే తన అసమర్థత తెలిసిపోతుందని కేసీఆర్‌ కు భయం పట్టుకుందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ సంపూర్ణ ద్రోహి అని వ్యాఖ్యానించారు. బీజేపీకి సహకరించిన వైసీపీ కూడా ద్రోహే అని అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా తెలంగాణ సీఎం కేసీఆర్‌ వద్దన్నారని, పోలవరం పనులు అడ్డుకుంటామన్న హరీశ్‌రావు చెప్పినప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీ నేత కేటీఆర్‌తో జగన్‌ మంతనాలు జరిపారని చెప్పారు. వీరి ముగ్గురి అజెండా ఒక్కటేనని దుయ్యబట్టారు.

కొంత సాయం చేసినా నవ్యాంధ్ర ఎదిగిపోతుందని ప్రధాని మోదీకి అసూయ అని చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌ ఇచ్చాక మోదీ రాష్ట్రానికి రావాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాపై నిరసనలు వ్యక్తం చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదు. వైసీపీని పట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ గడ్డపై పుట్టిన ప్రతిఒక్కరూ సంఘటితం కావాలని ప్రజలకు పిలుపిచ్చారు.

Related posts