ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం ఇటీవల పలుపథకాలు ప్రవేశపెడున్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10, 12వ తరగతి విద్యార్థుల పరీక్ష రుసుమును ఈ ఏడాదికి గాను ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు పంపినట్టు తెలిపారు. 10, 12వ తరగతి పరీక్ష ఫీజులను సీబీఎస్ఈ ఇటీవల భారీగా పెంచిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.