telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు

CLP Batti vikramarka fire KCR KTR

తెలంగాణలో పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఈరోజు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి భట్టి ఫిర్యాదును అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ లో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం పట్ట పగలే ఖూనీ చేస్తోందని అన్నారు.

ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ విలీనం అంటే సామాన్యమైన ప్రక్రియ కాదని భట్టి అన్నారు. గతంలో కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసే సమయంలో గ్రామ కమిటీల నుంచి పార్టీ అధినేత వరకు అందరి తీర్మానాలను ఈసీకి పంపి, ఆ తర్వాత విలీనం చేయడం జరిగిందని గుర్తు చేశారు.

Related posts