telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

స్పీకర్‌‌ కు భట్టి విక్రమార్క వినతిపత్రం

CLP Batti vikramarka fire KCR KTR

తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఈ సందర్భంగా వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగడం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని, స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్‌ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని భట్టి విక్రమార్క హెచ్చరించారు.

Related posts