telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

డెంగ్యూ గురించి సరైన సమాధానం ఇవ్వడం లేదు: మల్లుభట్టి

Batti vikramarka

అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ సీఎల్పీనేత మల్లుభట్టి విక్రమార్క తెలంగాణలో ప్రబలుతున్న జ్వరాల గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డెంగ్యూ గురించి సరైన సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. ప్రజలు రోగాలతో విలవిలలాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని మంత్రి ఈటల చెబుతున్నారు. రాష్ట్రంలో అనారోగ్యం ఎక్కువగా ఉంది కాబట్టే ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరిగింది. అంతే కానీ ఇందులో ప్రభుత్వ గొప్పతనం ఏమీ లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వసతులు కల్పించకపోతే కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని భట్టి హెచ్చరించారు.

Related posts