telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తిరుగుబాటు: భట్టి

Batti vikramarka

ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. భూస్వాముల కోసమే తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ ప్రక్షాళన చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ ప్రక్షాళన పేరుతో రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వ వైఖరితో అధికారులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు.

నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయారన్నారు. నకిలీ విత్తనాలను బయటపెట్టిన అధికారులను సస్పెండ్ చేశారన్నారు. పార్టీలను పోషిస్తే చాలు అక్రమ విత్తన కంపెనీలకు అనుమతులు ఇస్తున్నారని వివరించారు. నకిలీ విత్తన కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, దీంతో రైతులు పంటలను నష్టపోతున్నారని అన్నారు.

Related posts