ఓ సివిల్ ఇంజనీర్ జల్సాల కోసం పక్కదారి పట్టాడు. బైకులు దొంగతనం చేసి అమ్ముతూ పోలీసులకు దొరికిపోయాడు. నల్లగొండ జిల్లా రామగిరికి చెందిన వెలువోలు వెంకటేష్ ప్రస్తుతం నగరంలోని రత్నగిరి నగర్లో నివాసముంటున్నాడు. గుంటూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో 2012లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం గుంటూరు, నల్గొండ, ఒడిశా, పూణె తదితర ప్రదేశాల్లో సివిల్ ఇంజనీర్గా పనిచేశాడు. గుంటూరులో పనిచేస్తున్న సమయంలో రాజీవ్ గృహకల్ప ప్లాట్ పేరు చెప్పిన డబ్బులు వసూలు చేసి జైలు పాలయ్యాడు. ఆ తర్వాత బయటకు వచ్చి మరో నిర్మాణ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఆ ఉద్యోగం కూడా మానేసి ఖాళీగా ఉంటూ డబ్బుల కోసం తండ్రితో గొడవపడడంతో ఇంటి నుంచి బయటికి వెళ్లగొట్టారు. అప్పటి నుంచి బైక్లు కొట్టేయడం మొదలుపెట్టాడు. గుంటూరులోని షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో బైక్లు చోరీ చేశాడు. రెండు నెలల వ్యవధిలో 20 బైక్లను కొట్టేసాడు. కానీ ఆ దొంగిలించిన ఓ బైక్ని అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసు విచారణలో 20 బైకులు దొంగిలించినట్లు తేలింది.
previous post
next post
వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ నేత అనురాధ ఫైర్