టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో సిటీ సివిల్ కోర్టు మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి కేటీఆర్పై వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. ఈ మేరకు రేవంత్రెడ్డిని ఆదేశిస్తూ సిటీ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వేసిన పరువునష్టం దావా పిటిషన్పై సిటీ సివిల్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఇంజక్షన్ ఆర్డర్పై వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు న్యాయస్థానం రేవంత్ రెడ్డికి ఇంజక్షన్ ఆర్డర్స్ జారీ చేసింది.
మాదకద్రవ్యాల కేసుతో ముడిపెడుతూ రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని నిన్న రేవంత్రెడ్డిపై కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. తప్పుడు ఆరోపణలను పరువునష్టం చర్యలుగా పరిగణించి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని సిటీ సివిల్ కోర్టును కేటీఆర్ కోరారు. పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను ట్విటర్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా రేవంత్ను ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది..