కరోనా కారణంగా డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు నేటి నుంచి అందుబాటులోకి వచ్చ్చాయి. సుదీర్ఘకాలం తర్వాత హైద్రాబాద్ నగరంలో సిటీ బస్సులు శుక్రవారం రోడ్డెక్కాయి. దాదాపు 185 రోజుల తరువాత సిటీ బస్సులు నడుస్తున్నాయి. 25 శాతం బస్సు సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించింది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రూట్లలో బస్సులు ప్రతీ డిపో నుంచి 25 బస్సులను నడుపుతున్నారు.
ముఖ్యంగా పటాన్చెరు–చార్మినార్, పటాన్చెరు–హయత్నగర్, ఉప్పల్–లింగంపల్లి, గచ్చిబౌలి–దిల్సుఖ్నగర్తోపాటు చార్మినార్, జూపార్కు, ఎల్బీనగర్, చింతల్, బీహెచ్ఈఎల్, కూకట్పల్లి తదితర ప్రాంతాలకు ఎక్కువ సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అలాగే, వీటిలో ఎక్కువగా ఎక్స్ప్రెస్ సర్వీసులే ఉండనున్నాయి. నేడు సిటీలో మొత్తం 625 బస్సులను తిప్పాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.