telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

సిటీ బస్సు బోల్తా.. 8 మంది పరిస్థితి విషమం.. 23 మందికి గాయాలు.. !

city bus accident 23 injured

బెంగళూరు నగరంలో సంచరిస్తున్న బీఎంటీసీ బస్సు ఫ్లైఓవర్ ఎక్కుతున్న సమయంలో అదుపుతప్పి పల్టీకొట్టడంతో 23 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలైనాయి. వారిలో 8 మంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ 1వ బ్లాక్ లో వెలుతున్న బీఎంటీసీ బస్సు ఫ్లైఓవర్ ఎక్కుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి సర్వీసు రోడ్డులోకి పల్టీ కొట్టింది. ఆ సందర్బంలో బీఎంటీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు ఒకరి మీద ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.

స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు బీఎంటీసీ బస్సులో ఉన్న ప్రయాణికులను బయటకు లాగడానికి ప్రయత్నించారు. అతి కష్టం మీద బస్సులో ఉన్న 23 మందిని బయటకు లాగారు. 23 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరంలో నిత్యం బీఎంటీసీ బస్సులు ప్రమాదాలకు గురికావడంతో వాటిలో ప్రయాణించడానికి ప్రజలు హడలిపోతున్నారు.

Related posts