కరోనా మహమ్మారి అన్నీ రంగలతో పాటు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. థియేటర్ల ఓపెన్ అయి చాలా రోజులు అవుతుంది. అయితే కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు క్రమంగా కరోనా నిబంధనలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా దాదాపు అన్నింటినీ తెరుస్తోంది. ఇందులో భాగంగా సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి అనుమతించింది.
వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసేందుకు టీఎస్ ప్రభుత్వం అనుమతించింది. పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. దీంతో థియేటర్లను పునఃప్రారంభించడానికి యాజమాన్యాలు ముందుకొచ్చాయి. ప్రభుత్వం సూచనల మేరకు కరోనా నిబంధనలను పాటిస్తూ.. పూర్తి స్థాయిలో అమలు చేస్తామని థియేటర్ల యాజమాన్యాలు తెలిపారు. కాగా థియేటర్ల్లో చివరగా ‘వకీల్ సాబ్’ విడుదలైంది. ఈరోజు థియేటర్లో సత్యదేవ్ ‘తిమ్మరుసు’, తేజ సజ్జ ‘ఇష్క్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే: ఆర్జీవీ