2019 లోక్ సభ ఎన్నికలలో సినీ గ్లామర్ ఏమాత్రం పని చేయలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఎన్నికలు సినిమాలు వేరు రాజకీయం వేరు అనే విషయాన్ని మళ్ళీ నిరూపించాయి. ఈ ఎన్నికలలో కొంతమంది సినీ తారలు మాత్రమే విజయకేతనం ఎగురవేయనున్నారు. అందులో రోజా( నగరి), బాలకృష్ణ (హిందూపూర్),సుమలత( కర్ణాటక) , హేమమాలని( మధుర, బీజేపీ), సన్నీ డియోల్ ( గురుదాస్ పూర్, బీజేపీ), స్మృతి ఇరానీ ( అమేథి, బీజేపీ), కిర్రన్ కేర్ (చండీఘర్, బీజేపీ) సాధించనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాన్ గాజువాక, భీమవరం నుండి పోటీ చేయగా ఆ రెండు స్థానాలలో ఆయన వెనుకంజలో ఉన్నారు.
పవన్ సోదరుడు నాగబాబు నరసాపురం లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేయగా ఆయనకి ఓటమి తప్పేలా లేదు. ప్రముఖ నిర్మాత పొట్లూరి వి విరప్రసాద్ విజయవాడ లోక్సభ స్థానం నుండి పోటీ చేయగా, ఆయన ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. యంగ్ హీరోయిన్ మాధవి లత బీజేపీ నుండి పోటీ చేయగా ఆమె కూడా వెనుకంజలోనే ఉంది. నార్త్ విషయానికి వస్తే… సీనియర్ నటి జయప్రద రాంపూర్ నుండి పోటీ చేయగా, ప్రస్తుతం వెనుకంజలో ఉంది. కాంగ్రెస్ తరపున నార్త్ ముంబై నుండి పోటీ చేసిన ఊర్మిళని కూడా ఓటమి పలకరించేలా ఉంది. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, పూనమ్ సిన్హా, మిమీ చక్రవర్తి కూడా వెనుకంజలోనే ఉన్నారు. ప్రకాష్ రాజ్ తన ఓటమిని అంగీకరిస్తూ ట్వీట్ కూడా చేయడం గమనార్హం.
ఇలా చేస్తే జనాభా నియంత్రణ సాధ్యం: బాబా రాందేవ్