హాలీవుడ్ చిత్రం “మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్” జూన్ 14న విడుదల కానుంది. అమెరికన్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఇది. ఎఫ్ గరెగ్రే దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని హిందీ, తమిళ్, తెలుగులో ఒకేసారి విడుదల చేయనున్నారు. చిత్రం విడుదల సమీపిస్తున్న సందర్భంగా చిత్ర హీరో క్రిస్ హేమ్స్ వర్త్ ఇండియాలో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ “వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీని తిన్నాను. నా ఫేవరేట్ డిష్ అది. స్పెషల్గా బిర్యానీని ఆర్డర్ ఇచ్చేవాడిని. ఎంత తిన్నా తనివితీరేది కాదు. ఆ రుచి అంత గొప్పగా ఉండేది” అని అన్నారు. షూటింగ్ స్పాట్లో తన ఫీలింగ్ గురించి ప్రస్తావిస్తూ “ప్రతిరోజూ వేల మంది జనాలు సెట్స్ మీద గుడిగూడేవారు. చాలా ఎగ్జయిటింగ్గా అనిపించేది. ప్రజలు కూడా చాలా పాజిటివ్గా ఉండేవారు. చాలా సపోర్ట్ చేసేవారు. వాళ్లందరి మధ్య షూటింగ్ చేస్తున్నంత సేపు మాకు `రాక్ స్టార్స్` అనే ఫీలింగ్ వచ్చేది. జీవితంలో గుర్తుండిపోయే క్షణాలవి” అని అన్నారు.
previous post