telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వదంతులు నమ్మొద్దు.. మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడు

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని అపోలో ఆస్పత్రికి చికిత్స పొందుతున్నారు. అయితే శివప్రసాద్ మరణించినట్టు మీడియాలో తప్పుడు వార్తలు రావడం పట్ల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తలను ఆయన అల్లుడు నరసింహ ప్రసాద్ ఖండించారు.

శివప్రసాద్‌కు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని, అధికారికంగా తాము ప్రకటించే వరకు వదంతులను నమ్మొద్దని నరసింహ ప్రసాద్ పేర్కొన్నారు. శివప్రసాద్ ఆరోగ్యంగానే ఉన్నాడని ఆయన ప్రకటించారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కోలుకొంటున్నారని ఆయన వెల్లడించారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దని కూడ ఆయన స్పష్టం చేశారు.

Related posts