సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో “చిత్రలహరి” సినిమా రూపొందుతోంది. కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో సునీల్, వెన్నెలకిషోర్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ రోజు ఉదయం టీజర్ ని విడుదల చేసారు. ‘‘చిత్రలహరి’లోని పాత్రలు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు. అప్పట్లో దూరదర్శన్ లో ఆదివారం రోజున వచ్చే ఓ ప్రోగ్రామ్… 2019లో చిత్రలహరి ఫ్రైడే రోజున రిలీజ్ కాబోయే సినిమా… ఆ సినిమాలోని కొన్ని పాత్రలు అంటూ టీజర్ ను స్టార్ట్ చేశారు. ఈ సినిమాలోని నాలుగు మెయిన్ పాత్రలను పరిచయం చేశారు. అబ్బాయిలంతా ఒక్కటే… పరిచయం కాకముందు ఒకలా.. అయ్యాక ఒకలా ఉంటారనే ఫీలింగ్ తో ఉండే నివేత… డిస్కస్ చేయాలి.. తెలుసుకోవాలి.. నీడ్ సమ్ టైమ్ అంటూ డైలమాలో కళ్యాణి ప్రియదర్శన్… జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండే సునీల్, జీవితంలోను సినిమాలోనూ విజయం కోసం ప్రయత్నం చేసే సాయి ధరమ్ తేజ్.. ఈ నలుగురివి నాలుగు డిఫరెంట్ పాత్రలు. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో మెగా మేనల్లుడు హిట్ అందుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. వరుస పరాజయాలతో డీలాపడిపోయిన సాయి ధరమ్ తేజ్ కు ఈ చిత్రం హిట్ కావడం చాలా ముఖ్యం. తేజ్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.