సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చిత్రలహరి’. నివేదా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. తొలిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఈ సినిమా రూ.3.08 కోట్ల షేర్ ని రాబట్టింది. మొదటివారం పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.9.30 కోట్లను రాబట్టింది. ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ నమోదు చేసింది.
ఏరియాల వారీగా “చిత్రలహరి” మొదటివారం కలెక్షన్స్ :
నైజాం – రూ.2.53 కోట్లు
సీడెడ్ – రూ.1.28 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.1.10 కోట్లు
తూర్పుగోదావరి – రూ.0.78 కోట్లు
పశ్చిమ గోదావరి – రూ.0.50 కోట్లు
కృష్ణా – రూ.0.60 కోట్లు
గుంటూరు – రూ.0.67 కోట్లు
నెల్లూరు – రూ.0.29 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో – రూ.7.75 కోట్లు
రెస్ట్ ఆఫ్ ది ఇండియా – రూ.0.75 కోట్లు
ఓవర్సీస్ – రూ.0.85 కోట్లు
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూలు చేసిన షేర్ రూ.9.35 కోట్లు
ఇండస్ట్రీలో “ఒకే ఒక్క ఛాన్స్…” అంటూ సంగీత షాకింగ్ కామెంట్స్