telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ రేట్లకు “సైరా” హక్కులు

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా భారీ రేట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. నైజాం హక్కుల కోసం యూవీ సంస్థ ఏకంగా 30 కోట్ల రూపాయలు చెల్లించిందట. అలాగే ఆంధ్ర ప్రాంత హక్కులను 60 కోట్లకు విక్రయించినట్టు సమాచారం. ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే దాదాపు 15 కోట్లకు `సైరా` హక్కులను విక్రయించినట్టు సమాచారం. సీడెడ్ హక్కుల విక్రయం ద్వారా దాదాపు పాతిక కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా హక్కులు వంద కోట్లకు పైగానే అమ్ముడు పోయాయన్నమాట.

Related posts