మెగాస్టార్ చిరంజీవికి గన్నవరం విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మెగా ఫ్యాన్స్ తో పాటు జనసేన నేతలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. ‘సైరా… సైరా’ అంటూ నినాదాలు చేశారు. చిరంజీవి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెళ్లనున్నారు. ఆయన వెంట దాదాపు 200కు పైగా వాహనాలు కదలనున్నాయి.
పట్టణంలోని హౌసింగ్ బోర్డు సెంటర్లో నెలకొల్పిన తొమ్మిది అడుగుల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరిస్తారు. సెంటర్కు ఎస్వీఆర్ సఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరిస్తారు. సెంటర్కు ఎస్వీఆర్ సర్కిల్గా నామకరణం చేస్తారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరు అయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
టీడీపీని అప్రతిష్టపాలు చేయడమే వైసీపీ లక్ష్యం: యనమల