telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

జగన్ ను మెచ్చుకున్న చిరంజీవి

ఏపీ సర్కార్‌ చేపట్టిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై తన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు మెగాస్టార్‌ చిరంజీవి. ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘ఏపీ వైద్య సిబ్బంది ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయడం ఓ గొప్ప కార్యక్రమం. దీని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. వైద్య సిబ్బంది కృషి ఫలితంగా కరోనా భూతాన్ని ఓడించగలమనే ఆత్మ విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఈ ప్రయత్నాలను కొనసాగించాలి. సీఎం జగన్‌ ది చాలా స్ఫూర్తిదాయం నాయకత్వం. ఆయనకు అభినందనలు తెలిపుతున్నాను. ‘ అంటూ మెగాస్టార్‌ చిరు ట్వీట్‌ చేశారు.

Related posts