ప్రముఖ హాస్య నటుడు అలీ తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో నిన్న రాత్రి 11.41 నిమిషాలకి రాజమహేంద్రవరంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. రాంచీ షూటింగ్లో ఉన్న అలీ.. తన తల్లి మరణ వార్త తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్కి తిరిగి వచ్చారు. ఇక కొద్ది సేపటి క్రితమే జైతున్ బీబీ పార్దివ దేహాన్ని కూడా రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్లోని అలీ ఇంటికి తీసుకువచ్చారు. చిరంజీవి, అలీ ఇంటికి వెళ్లి జైతున్కి నివాళులు అర్పించారు. అలీ కుటుంబానికి ధైర్యం అందించారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్లో ఆమె అంత్యక్రియలు జరపనున్నట్టు తెలుస్తుంది.
Chiranjeevi offers condolences to #Ali and his family on the demise of Ali’s mother. pic.twitter.com/czzaRtZSsY
— BARaju (@baraju_SuperHit) December 19, 2019