telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్‌ మూవీ మరింత ఆలస్యం.. కారణమిదే

Chiru

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెరకెక్కస్తున్న సినిమా ‘ఆచార్య’ షూటింగ్ మొదలైన సంగతి తెలసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వ వహిస్తున్నాడు. ఈ సినిమా తరువాత చిరు తన తరువాతి ప్రాజెక్ట్ లూసిఫర్‌ను మొదలు చేయనున్నారని వార్తలు వచ్చాయి. మళయాళం భారీ హిట్ అయిన లూసిఫర్ సినిమాను చిరు తెలుగు రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపారు. దాంతో ఆ సినిమా రీమేక్ రైట్స్‌ను రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు ఎవరి చేతికి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. దాని కోసం కొందరి పేర్లు వినిపించాయి. మొదటగా సూజీత్‌కు ఈ దర్శకత్వ బాధ్యతలను అప్పజెప్పారని, దాంతో సినిమా స్క్రిప్ట్‌లో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సుజిత్ చేసిన మార్పులు చిరు నచ్చకపోవడంతో మరో దర్శకుడి వేటలో పడినట్లు తెలుస్తోంది. దాంతో చిరూనే రంగంలోకి అనుభవం కల దర్శకుడు వీవీ వినాయక్‌కు ఈ సినిమా దర్శక బాధ్యతలు అందించాలని అనుకున్నారట. ఇంతలో మరో దర్శకుడు మోహన్ రాజాకు ఓ చాన్స్ ఇచ్చారు. అయితే ఈ సినిమా ఇప్పుడప్పుడే మొదలు అయ్యేలా కనిపించడంలేదు. చిరుకు నచ్చిన స్క్రిప్ట్ రెడీ అవ్వడానికి సమయం పడుతుండటంతో చిరు తన షెడ్యూల్‌లో మరో సినిమాను ముందుకు తీసుకొచ్చారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చేవిధంగా స్క్రిప్ట్‌ను సిద్దం చేయనున్నారని సమాచారం.

Related posts