ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. అందుకే ప్రముఖుల జీవితాలను తెరపై ప్రేక్షకులకు చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే తెలుగులో సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి లెజెండ్స్ బయోపిక్స్ వచ్చాయి. ఇందులో సావిత్రి బయోపిక్ మహానటి సంచలన విజయం సాధించింది కూడా.ఇదే క్రమంలో ఇప్పుడు చిరంజీవి బయోపిక్ కూడా వస్తుందేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి..సైరా సక్సెస్ మీట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. రామ్ చరణ్ తన పాత్రకు న్యాయం చేస్తాడనే నమ్మకం తనకు ఉందన్నారు. కానీ సమస్యలున్నాయి. తన బయోపిక్లో రామ్ చరణ్ కంటే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్లలో ఎవరో ఒకరు హీరోగా నటిస్తే బాగుంటుందని చెప్పారు. ఈ ముగ్గురిలో నా పోలికలు ఎక్కువగా ఉన్నాయని తన సన్నిహితులు చెబుతూ ఉంటారు. అందుకే వీళ్లలో ఎవరు నటించినా బాగుంటుందన్నారు. ఎవరు చేసినా.. మా కుటుంబానికి చెందిన వారు చేస్తేనే బాగుంటుందని చెప్పారు. మొత్తానికి చిరంజీవికి తన బయోపిక్ తెరకెక్కిస్తే బాగుంటుందని తన మనసులో మాట చెప్పడం విశేషం.
previous post
next post