కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సామాజిక కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో చిరు సరసన కాజల్ అగర్వాల్ రెండోసారి జత కట్టబోతోంది. సోనూసూద్ మరో కీలక పాత్రలో నటించబోతుండగా… రెజీనా ప్రత్యేక గీతంలో మెరవనుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీని ఓ కీలక పాత్ర కోసం అనుకున్నామని.. కానీ ఇంకా అతడు డేట్లు ఇవ్వలేదని చిరు ఓ క్లారిటీని ఇచ్చారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మరో పాత్ర కోసం మెగా డాటర్ నిహారికను తీసుకోవాలని చిరు భావిస్తున్నారట. హీరోయిన్గా నాలుగు (తమిళ్తో కలిపి) చిత్రాల్లో నటించినప్పటికీ.. ఆ సినిమాలేవీ నిహారికకు కలిసి రాలేదు. అయితే సినిమాలపై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన చిరు, చెర్రీ తమ మూవీల్లోనైనా అవకాశం ఇవ్వాలని అనుకున్నారట. ఈ క్రమంలో ఇదివరకు ‘సైరా’లో నిహారికకు ఛాన్స్ ఇచ్చిన చిరు.. ఇప్పుడు ‘ఆచార్య’లో కూడా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ అవకాశంపై నిహారిక కూడా ఎగిరి గంతేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. కాగా ప్రస్తుతం నిహారిక వెబ్ సిరీస్లను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.
previous post