తెలంగాణ లోకసభ ఎన్నికల్లో మెగాస్టార్, మాజీ పార్లమెంటు సభ్యుడు చిరంజీవి ప్రచారం చేయనున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున చిరంజీవి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. తన బంధువు కొండా విశ్వేశ్వరరెడ్డి తరపున ఈ నెల 8న చిరంజీవి వికారాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి మంగళవారం ప్రకటించారు.
చిరంజీవి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ నేతలే. వీరి మధ్య బంధుత్వం కూడా ఉంది. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన తరపున ప్రచారం చేయడం లేదు. పవన్ కల్యాణ్ బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొంటారు. జనసేన తెలంగాణలో సికింద్రాబాద్, మల్కాజిగిరి, నిజామాబాద్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల నుంచి తన అభ్యర్థులను బరిలోకి దింపిన విషయం విధితమే.
ఇండస్ట్రీలో “ఒకే ఒక్క ఛాన్స్…” అంటూ సంగీత షాకింగ్ కామెంట్స్