telugu navyamedia
సినిమా వార్తలు

పీపుల్స్ స్టార్ కోసం మెగాస్టార్

chiranjeevi on maa schemes

పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌. నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో స్నేహ చిత్ర పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన చిత్రం “మార్కెట్లో ప్రజాస్వామ్యం”. ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మంగళవారం చిత్ర ఆడియోను విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరగనున్న ఈ ఆడియో వేడుకకు అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్లుగా చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ “ఓటు విలువను తెలియజేసే చిత్రం ఇది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది బ్రహ్మాస్త్రం. భవిష్యత్తు తరాల మనుగడకి ఓటు ప్రాముఖ్యతను తెలియజేసే కథ, కథనాలతో ఈ సినిమా చేశా. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను ఇందులో చూపించాం” అని తెలిపారు.

Related posts