దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అత్యవసర సేవలు అందించే బ్లడ్ బ్యాంకులపై లాక్ డౌన్ ప్రభావం పడకుండా ఉండేందుకు, వాటిలో రక్త నిల్వలు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రక్తదానం చేయదలచుకున్న వారు చేస్తున్నారు.
ఇటీవలే టాలీవుడ్ హీరో నాని దంపతులు వచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్బ్యాంక్కు వెళ్లి రక్తదానం చేశారు. తాజాగా, ప్రముఖ హీరో చిరంజీవి రక్తదానం చేశారు. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఆయన రక్తదానం చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా మాస్క్ ధరించి తగిన జాగ్రత్తలను ఆయన పాటించారు.
ఆ వ్యాఖ్యల వల్ల సూసైడ్ చేసుకుందామనుకున్నా… సీనియర్ నటుడు చలపతిరావు