telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“లూసిఫర్” రీమేక్ కు సిద్ధమవుతున్న చిరంజీవి…!

chiranjeevi

‘సైరా’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ తో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టులో ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. అయితే.. ఈ సినిమాలో రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపిస్తుండడంతో ఈ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాతే విడుదలవుతుంది అనే మరో వాదన కూడా ఉంది. ఏది ఏమైనా.. ‘ఆచార్య’తో సంబంధం లేకుండా.. ఈ ఏడాది చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌ని కూడా పట్టాలెక్కించబోతున్నాడట. ఇప్పటికే ‘లూసిఫర్’ సినిమా రీమేక్ కి సంబంధించిన రైట్స్ దక్కించుకున్నాడు రామ్ చరణ్. మలయాళీ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన ‘లూసిఫర్’ సినిమాకి మరో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ దర్శకత్వం వహించాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వ‌చ్చిన ఈ సినిమా.. కలెక్షన్ల పరంగా మాలీవుడ్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం తెలుగు రీమేక్‌కి సంబంధించి రామ్ చ‌ర‌ణ్‌ కోరికపై డైరెక్టర్ సుకుమార్ స్క్రిప్టులో కొన్ని మార్పుచేర్పులు చేశాడట. దాంతో.. ‘లూసిఫర్’ రీమేక్‌కి సుకుమారే దర్శకత్వం వహిస్తాడనే టాక్ వినిపిస్తోంది. అలాగే… ఈ సినిమాను రామ్ చరణ్ తో కలిసి ఎస్వీ ప్రసాద్ నిర్మించబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు.. చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌లోనూ రామ్ చరణ్ ఎక్స్‌టెండెడ్ కేమియోలో అలరించనున్నాడట.

Related posts