స్టార్ హీరోలు, సినీ ప్రముఖులంతా ఒకే వేదికపై సందడి చేసే సైమా… సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల 15, 16 తేదీలలో ఈ వేడుకలు జరుగబోతున్నాయి. ఈసారి వేడుకలకు ఖతర్లోని దోహా వేదిక కానుంది. రెండ్రోజుల పాటు జరుగనున్న వేడుకలకు దక్షిణాదికి చెందిన నాలుగు భాషల సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ హాజరుకాబోతున్నారు. 15వ తేదీన జరగబోయే కార్యక్రమంలో తెలుగు, కన్నడ భాషలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లబోతున్నారు. 16న జరగబోయే కార్యక్రమంలో తమిళ, మలయాళ భాషల సినీ ప్రముఖులు పాల్గొంటారు. 16న మోహన్లాల్ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు.
previous post
next post