telugu navyamedia
సినిమా వార్తలు

చిరంజీవి, మోహన్ లాల్ ముఖ్య అతిథులుగా “సైమా” వేడుకలు

SIIMA

స్టార్ హీరోలు, సినీ ప్రముఖులంతా ఒకే వేదిక‌పై సంద‌డి చేసే సైమా… సౌత్ ఇండియన్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్‌ వేడుక‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. వ‌చ్చే నెల 15, 16 తేదీల‌లో ఈ వేడుక‌లు జ‌రుగ‌బోతున్నాయి. ఈసారి వేడుక‌ల‌కు ఖ‌త‌ర్‌లోని దోహా వేదిక కానుంది. రెండ్రోజుల పాటు జ‌రుగ‌నున్న వేడుక‌ల‌కు ద‌క్షిణాదికి చెందిన నాలుగు భాష‌ల సినీ ప్ర‌ముఖులు హాజ‌రు కాబోతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, మ‌ల‌యాళ అగ్ర‌న‌టుడు మోహ‌న్ లాల్ హాజ‌రుకాబోతున్నారు. 15వ తేదీన జ‌ర‌గ‌బోయే కార్య‌క్ర‌మంలో తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌కు చెందిన సినీ ప్ర‌ముఖులు పాల్గొంటారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్ల‌బోతున్నారు. 16న జ‌ర‌గ‌బోయే కార్య‌క్ర‌మంలో త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల సినీ ప్ర‌ముఖులు పాల్గొంటారు. 16న మోహ‌న్‌లాల్ ఆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతారు.

Related posts