telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చింతమనేనికి బెయిల్ మంజూరు.. జిల్లా జైలు నుంచి విడుదల

Chintamaneni tdp

ఏలూరు జిల్లా జైలు నుంచి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యారు. 67 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయనకు నిన్న కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 14 కేసుల్లో బెయిల్ రాగా.. నిన్న నాలుగు కేసుల్లో బెయిల్ మంజూరు అయింది.

ఈ ఏడాది ఆగస్టు 29న పెదవేగి మండలం పినకడిమికి చెందిన చెరుకు జోసెఫ్ పై దాడి చేసి కులం పేరుతో దూషించారన్న అభియోగంతో పెదపాడు పోలీస్ స్టేషన్ లో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. చింతమనేని విడుదలైన తర్వాత భారీ ర్యాలీ నిర్వహించాలని ఆయన అభిమానులు ప్లాన్ చేశారు. అయితే పోలీసులు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Related posts