ఏపీలో కూడా కాంగ్రెస్-టీడీపీ కలిసి పోటీకి సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అవి అలా మీడియాలో వచ్చాయోలేదో వెంటనే దానిని ఖండించారు. ఏపీలో ఏపార్టీ కూడా కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేకపోయినా కూడా ఆ పార్టీ మాత్రం ఇలా అంటుంది. వైసీపీ అధినేత జగన్ అంగీకరిస్తే ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత చింతామోహన్ ప్రకటించారు. జగన్ సీఎం అభ్యర్థి అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తోనూ పొత్తు పెట్టుకునేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
ఇది తన వ్యక్తిగత అభిప్రాయమనీ, ఈ విషయమై త్వరలోనే కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చిస్తానని పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ నష్టపోయిందని చింతామోహన్ అభిప్రాయపడ్డారు. ఏపీలో టీడీపీతో పొత్తుపెట్టుకోరాదనీ, లేదంటే తీవ్రంగా నష్టపోతామని హెచ్చరించారు.
పరిపాలించడం చేతకాకే… బీజేపీపై టీఆర్ఎస్ విమర్శలు: బాబు మోహన్