telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

యోగా, ధ్యానంతో కరోనాను అరికట్టవచ్చు: చినజీయర్ స్వామి

china jiyar swamy

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ సంప్రదాయాలతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. యోగా, ధ్యానంతో కొంతవరకు కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు.

వ్యక్తిగత పరిశుభ్రత వల్ల కరోనా బారినపడకుండా రక్షించుకోవచ్చని తెలిపారు. జనసమూహాలకు దూరంగా ఉండడం అవసరమని సూచించారు. భారత్ లో అనేక రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు భారత్ లో కరోనా వైరస్ సోకి ముగ్గురు మృతి చెందారు.

Related posts